కౌన్సెలింగ్‌ విధానం మార్చకుంటే ఉద్యమం

ABN , First Publish Date - 2020-12-06T05:20:33+05:30 IST

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో త్వరలో జరగనున్న ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌కు బదులు మాన్యువల్‌గా చేపట్టాలని, లేకుంటే దశలవారీ ఉద్యమం చేపడతామని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి పేర్కొన్నారు.

కౌన్సెలింగ్‌ విధానం మార్చకుంటే ఉద్యమం

ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణమూర్తి

కొండకరకవలస(ఎల్‌.ఎన్‌.పేట): రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో త్వరలో జరగనున్న ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌కు బదులు మాన్యువల్‌గా చేపట్టాలని, లేకుంటే దశలవారీ ఉద్యమం చేపడతామని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి పేర్కొన్నారు. శనివారం కొండకరకవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త సభ్యత్వాలను స్వీక రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. వెబ్‌కౌన్సిలింగ్‌ వల్ల సంబంధిత జిల్లా స్థాయి అధికారులు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్థానాలను బ్లాక్‌ చేసి తమ ఇష్టానుసారం బదిలీలు చేసే అవకాశం ఉందన్నారు. తక్షణం ఈ విధానాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్య దర్శి జి.రమణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు కె. తేజేశ్వరరావు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-12-06T05:20:33+05:30 IST