కానిస్టేబుల్‌ నిజాయితీ

ABN , First Publish Date - 2020-05-13T11:05:08+05:30 IST

పాలకొండ స్టేట్‌బ్యాంకు వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ మదన్‌మోహన్‌ నిజా యితీని చాటుకున్నాడు.

కానిస్టేబుల్‌ నిజాయితీ

పాలకొండ, మే 12: పాలకొండ స్టేట్‌బ్యాంకు వద్ద విధులు నిర్వహిస్తున్న  కానిస్టేబుల్‌ మదన్‌మోహన్‌  నిజా యితీని చాటుకున్నాడు. మంగళవారం విధులు నిర్వహి స్తున్న సమయంలో బ్యాంకు వద్ద ఓ టీ దుకాణంలో లభించిన కవరులో రూ.14,300 నగదుఉంది. నగదును బ్యాం కు మేనేజర్‌కు ఆయన అందించారు. నగదు పొగొట్టుకున్న వ్యక్తి సరైన ఆధారాలతో వస్తే తిరిగి అందజేస్తామని బ్యాం కు మేనేజర్‌ తెలిపారు. మదన్‌మోహన్‌ను డీఎస్పీ రారాజుప్ర సాద్‌, సీఐ ఆదాం, ఎస్‌ఐ జనార్దనరావు అభినందించారు. 

Updated Date - 2020-05-13T11:05:08+05:30 IST