కరోనాపై నిర్లక్ష్య ధోరణి తగదు: కలెక్టర్
ABN , First Publish Date - 2020-10-24T10:52:59+05:30 IST
జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టాయనే భావనతో కరోనాపై నిర్లక్ష్య ధోరణి తగ దని, ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నివాస్ కోరారు.
గుజరాతీపేట: జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టాయనే భావనతో కరోనాపై నిర్లక్ష్య ధోరణి తగ దని, ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నివాస్ కోరారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో కరోనా నియంత్రణపై పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ రానున్న కాలంలో స్వీయనియంత్రణ పాటించకపోతే మునుపటికంటే కేసులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. జేసీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
మరుగుదొడ్లను సక్రమంగా నిర్వహించుకోవాలి
మరుగుదొడ్లను సక్రమంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత బాలికలదేనని కలెక్టర్ నివాస్ తెలిపారు. స్థానిక మహిళా కళాశాల ఆవరణలో నిర్మించిన మరుగుదొడ్లను మార్పు కార్యక్రమం పేరుతో శుక్రవారం కలెక్టర్ సమక్షంలో బాలికల చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో మార్లు ప్రత్యేకాధికారి పి .రజనీకాంతారావు, ఈఈ కె.భాస్కరరావు, ఏఈ కిరణ్, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జి ఉప సంచాలకులు రామారావు, తదితరులు పాల్గొన్నారు.