కొట్లాట కేసులో ఇరువర్గాలపై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-06-07T06:40:06+05:30 IST
అంధవరం పంచాయతీ రామకృష్ణాపురంలో శనివారం జరిగిన కొట్లాటలో ఇరువర్గాలపై కేసు నమోదు
రామకృష్ణాపురం(జలుమూరు), జూన్ 6: అంధవరం పంచాయతీ రామకృష్ణాపురంలో శనివారం జరిగిన కొట్లాటలో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వై.కృష్ణ తెలిపారు. ఖాళీ స్థలం కోసం జరిగిన కొట్లాటలో ఇరు వర్గాలకు చెందిన నలుగురు గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. రేగాన శ్యాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేగాన మహేష్తో పాటు మరో ఆరుగురిపూ, అలాగే కిలారు శ్రీరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేగాన శ్యాం వారి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.