సామాజిక ఆసుపత్రిని సందర్శించిన ఆర్డీవో
ABN , First Publish Date - 2020-12-13T05:34:24+05:30 IST
స్థానిక సామాజిక ఆసుపత్రిని శనివారం పాలకొండ ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నెల 8న ‘ఆంధ్రజ్యోతి’లో ‘వైద్యులేరీ..?’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ జె.నివాస్ స్పందించి... ఆసుపత్రిలో పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆర్డీవో టీవీఎస్జీ కుమార్ను ఆదేశించారు.

స్పందించిన అధికారులు
సామాజిక ఆసుపత్రిని సందర్శించిన పాలకొండ ఆర్డీవో
వైద్యులు, సిబ్బంది డుమ్మాపై ఆరా...
కలెక్టర్కు పూర్తిస్థాయి నివేదిక
రాజాం : స్థానిక సామాజిక ఆసుపత్రిని శనివారం పాలకొండ ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నెల 8న ‘ఆంధ్రజ్యోతి’లో ‘వైద్యులేరీ..?’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ జె.నివాస్ స్పందించి... ఆసుపత్రిలో పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆర్డీవో టీవీఎస్జీ కుమార్ను ఆదేశించారు. దీంతో ఆర్డీవో ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో పరిస్థితిపై సూపరింటెండెంట్ మహంతి చంద్రశేఖర్నాయుడును అడిగి తెలుసుకున్నారు. 14 మంది వైద్యులకు గాను ఆరుగురు విధులకు గౌర్హాజరయ్యారు. స్టాఫ్నర్సులు కూడా ఐదుగురు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు 100 పడకల ఆసపత్రిని ఏర్పాటు చేస్తే ఇస్టానుసారంగా విధులు నిర్వహిస్తుండడంపై మండిపడ్డారు. అనంతరం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఆసుపత్రిలో పరిస్థితిపై పూర్తి స్థాయిలో నివేదికను కలెక్టర్కు అందిస్తానని చెప్పారు. ఇకపై ఆసుపత్రి పనితీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు.