కాన్వొకేషన్ పట్టాల కోసం దరఖాస్తులు
ABN , First Publish Date - 2020-03-29T11:35:19+05:30 IST
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 2, 3 కాన్వొకేషన్లో పట్టాలు పొందేందుకు ఏప్రిల్ 24వ
ఎచ్చెర్ల, మార్చి 28: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 2, 3 కాన్వొకేషన్లో పట్టాలు పొందేందుకు ఏప్రిల్ 24వ తేదీలోగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.రఘుబాబు తెలిపారు. డిగ్రీ, పీజీ, ప్రొఫెషన్ కోర్సులు, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2018-19 సంవత్సరం వరకు చదివినవారు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులని చెప్పారు.