అల్పపీడనంతో మారిన వాతావరణం
ABN , First Publish Date - 2020-10-22T11:46:10+05:30 IST
అల్పపీడనంతో మారిన వాతావరణం
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా అంతటా వాతావరణం మా రింది. ఉదయం ఆకాశంలో దట్టంగా మబ్బులు కమ్ముకు న్నాయి. ఆతర్వాత కొద్దిసేపటికే ఎండకాచింది. మధ్యాహ్నం మళ్లీ మబ్బులు వచ్చాయి. సాయంత్రం వాతావరణంలో తేమ శాతం తగ్గి తీవ్ర ఉక్కపోతకు ప్రజలు గురయ్యారు. అక్కడక్కడా మోస్తరు వర్షం కురిసింది. శ్రీకాకుళంలో చిరుజల్లులు కురిశాయి. అల్పపీడన ప్రభావంతో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.