-
-
Home » Andhra Pradesh » Srikakulam » Action must be taken against the invaders
-
ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-29T05:03:34+05:30 IST
ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అక్రమించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.

కలెక్టరేట్ : ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అక్రమించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కళ్లేపల్లి పంచాయతీ పరిధిలో కొందరు వందల ఏకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఎటువంటి అనుమతులు లేకుండా రొయ్యల చెరువులు తవ్వుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు విచారణ చేపట్టి ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు.