జవాన్ కుటుంబానికి ఆత్మీయ స్వాగతం
ABN , First Publish Date - 2020-11-13T05:40:00+05:30 IST
జవాన్ కుటుంబ సభ్యులకు ఆత్మీయ స్వాగతం లభించింది. రెండు రోజుల కిందట రాజస్థాన్లో విధి నిర్వహణలో ఉండగా బైపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సురపతి గోపాలకృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.
జాతీయ జెండాతో బైపల్లి గ్రామస్థుల ర్యాలీ
వజ్రపుకొత్తూరు, నవంబరు 12: జవాన్ కుటుంబ సభ్యులకు ఆత్మీయ స్వాగతం లభించింది. రెండు రోజుల కిందట రాజస్థాన్లో విధి నిర్వహణలో ఉండగా బైపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సురపతి గోపాలకృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బుధవారం అంత్యక్రియ లకు హాజరైన కుటుంబ సభ్యులు గురువారం బైపల్లి చేరుకున్నారు. గ్రామ పొలిమేర నుంచి గ్రామస్థులు, యువకులు 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీగా వారిని ఊరిలోకి తీసుకెళ్లారు. గోపాలకృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. కుటుంబసభ్యులు, బంధు వులు, స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు.