వైసీపీ దాష్టీక పాలనను ఎండగట్టాలి
ABN , First Publish Date - 2020-12-30T05:46:08+05:30 IST
వైసీపీ దాష్టీక పాలనను ఎండగడుతూ ప్రజల్లో అవగాహన కల్పించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించండి
టీడీపీ శ్రేణులకు నారా లోకేష్ పిలుపు
కనిగిరి, డిసెంబరు 29 : వైసీపీ దాష్టీక పాలనను ఎండగడుతూ ప్రజల్లో అవగాహన కల్పించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎర్రగొండపాలెం రైతులను పరామర్శించేం దుకు వచ్చిన లోకేష్ను మంగళవారం మాజీ ఎమ్మెల్యే డాక్ట ఉగ్ర నరసింహారెడ్డి, నాయ కులు, కార్యకర్తలు ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వ ర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై లోకేష్ ఉగ్రను అభినందించారు. గ్రామస్థాయి నుం చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే మరో పక్క వైసీపీ పాలకుల ప్రజా వ్యతిరేక విధా నాలను తీసుకెళ్లాలన్నారు. ఐ-టీడీపీ మీడి యా ద్వారా స్థానిక సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీ సుకురావాలని లోకేష్ సూచించారు. అనం తరం ఐ-టీడీపీ క్యాలెండర్ను ఆయన ఆవి ష్కరించారు. ఉగ్రతో పాటు ఎమ్మెల్యేలు గొట్టి పాటి రవికుమార్, స్వామి, మాజీ ఎమ్మెల్యే లు ముత్తుముల అశోక్రెడ్డి, కందుల నారా యణరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, స్థానిక టీడీపీ నాయ కులు దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, గాయం తి రుపతిరెడ్డి, జంషీర్ అహ్మద్, పువ్వాడి వెం కటేశ్వర్లు, పార్లమెంట్ రైతు అధ్యక్షుడు ఏలూరి వెంకటేశ్వర్లు తదితరులు లోకేష్కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
తరలివెళ్లిన పామూరు శ్రేణులు
పామూరు : నారా లోకేష్ పర్యటనలో పాల్గొనేందుకు పామూరు నుంచి టీడీపీ శ్రే ణులు తరలివెళ్లారు. టీడీపీ మండల అధ్య క్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, ఒంగోలు పార్ల మెంట్ తెలుగు రైతు అధ్యక్షుడు ఏలూరి వెం కటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. రైతు సమస్యలపై వెను వెం టనే స్పందించేలా కృషి చేయాలని లోకేష్ ఏలూరికి సూచించారు.
లోకేష్ను కలిసిన టీడీపీ నాయకులు
దొనకొండ : నారా లోకేష్ను టీడీపీ మం డల నాయకులు కురిచేడు అడ్డరోడ్డు వద్ద కలిశారు. టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు శివకోటేశ్వరరావు, ద ర్శి ఏఎంసీ మాజీ డైరెక్టర్ దుగ్గెంపూడి చెంచ య్య, నియోజకవర్గ కోఆర్డినేటర్ పమిడి ర మేష్ నేతృత్వంలో రైతు కుటుంబంతో కూడి న పెయింటింగ్ను బహూకరించారు.