మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-12-05T05:36:14+05:30 IST

మహిళల స మగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికగాబ ద్దంగా కృషి చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం
అవగాహన ర్యాలీలో పాల్గొన్న చైర్‌పర్సన్‌ పద్మ, కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తదితరులు


మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ


ఒంగోలునగరం, నవంబరు 4: మహిళల స మగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికగాబ ద్దంగా కృషి చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన ఆమె శుక్రవారం ఒంగోలులోని ప్రకాశంభవనంలోని సమావేశం హాలులో స్వచ్చంద సంస్థల ప్రతినిధు లు, మహిళలు, అధికారులతో సమావేశమయ్యా రు. మహిళా సాధికారిత సాధించే దిశగా ప్ర భుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని, దీనిని అమలు చేయాలని ఆమె కోరారు. ఇందులో భాగంగా మహిళలకు వారి కోసం ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహ న కలిగించాలన్నారు. ముందుగా ఆమె ప్రకాశం భవనం వద్ద బైకు ర్యాలీని జెండాఊపి ప్రారంభించారు. అలాగే హౌసింగ్‌ బోర్డులోని స్వధార్‌ హోంను, ఇతర చిన్నారుల ఆశ్రమాలను పరిశీలించారు. వారికి అందుతున్న సౌకర్యాలను అడి గి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ పో లా భాస్కర్‌, కమిషన్‌ డైరెక్టర్‌ సూయిజ్‌, సభ్యురాలు రమాదేవి, చైల్డ్‌వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ సీహెచ్‌.భారతి, దిశ డీఎస్పీ ధనుంజయ, ఐసీడీ ఎస్‌ పీడీ లక్షీదేవి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-05T05:36:14+05:30 IST