వెలిగొండ నిర్వాసిత గ్రామాల ఖాళీ ప్రక్రియ మొదలు!

ABN , First Publish Date - 2020-12-27T07:10:42+05:30 IST

వెలిగొండ ప్రాజెక్టు కోసం నిర్వాసితులు జన్మభూమిని వీడుతున్నారు. ప్రజాహితం కోరి అమ్మలాంటి పుట్టి పెరిగిన ఊరిని విడిచి వెళ్తున్నారు.

వెలిగొండ నిర్వాసిత గ్రామాల ఖాళీ ప్రక్రియ మొదలు!
ఇళ్ల కూల్చివేతను పరిశీలిస్తున్న కలెక్టర్‌ భాస్కర్‌

పెద్దారవీడు, డిసెంబరు 26 : వెలిగొండ ప్రాజెక్టు కోసం నిర్వాసితులు జన్మభూమిని వీడుతున్నారు. ప్రజాహితం కోరి అమ్మలాంటి పుట్టి పెరిగిన ఊరిని విడిచి వెళ్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు కింద పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, గుండంచర్ల, కలనూతల ముంపు గ్రామాలుగా ఉన్నాయి. ఇందులో సుంకేసులలోని ఎస్సీ కాలనీలో 12 కుటుంబాలకు చెందిన 37 మందికి అధికారులు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.4.62 కోట్లు చెల్లించారు. ఈ నేపథ్యంలో శనివారం కలెక్టర్‌ పోలా భాస్కర్‌, జేసీ వెంకటమురళి, ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ అక్కడ పర్యటించారు. అనంతరం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ బ్యాంకు ఖాతాల్లో జమ అయిన కుటుంబాలతో మాట్లాడారు. వారి గృహాలను ఖాళీ చేయించారు. వెంటనే జేసీబీ సహాయంతో వాటిని కూల్చివేయించారు. అక్కడ ఏళ్లుగా నివాసముంటున్న ఆ కుటుంబాల వారు బాధపడుతూనే తమ సామగ్రిని ఆటోలో వేసుకొని గ్రామాన్ని వీడారు.







Updated Date - 2020-12-27T07:10:42+05:30 IST