కరోనా నియంత్రణకు టన్నెల్స్ !
ABN , First Publish Date - 2020-04-08T11:25:44+05:30 IST
కరోనా వైరస్ నియంత్రణకు ఒంగోలు కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేప ట్టింది.

ఒంగోలులో ఏడు ప్రాంతాలలో ఏర్పాటు
నేడు పీవీఆర్లో మార్కెట్లో ప్రారంభం
ఒంగోలు (కార్పొరేషన్) ఏప్రిల్ 7 : కరోనా వైరస్ నియంత్రణకు ఒంగోలు కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేప ట్టింది. ఇందుకోసం కలెక్టర్ కార్యాలయం, పీవీఆర్ బా లుర పాఠశాల, నగరంలోని పలు రైతు బజార్లు వద్ద ప్ర త్యేక టన్నెల్స్ను ఏర్పాటు చేయనున్నారు. ముందుగా బుధవారం ఉదయం పీవీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ వద్ద ప్రారంభించనున్నారు. రెడ్క్రాస్ సహకారంతో కరోనా నియంత్రణ టన్నెల్స్ ఏర్పా టు చేయనున్నట్లు కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఒక్కో యంత్రం ఖరీదు సుమారుగా రూ.25వేలు వరకు ఉంటుందని చెబుతున్నారు.
అయితే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రాధమిక దశలోనే నియం త్రించేందుకు ఈ విధానం అందుబాటులోకి తీసుకురాను న్నారు. తమిళనాడులో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉంది. ఇప్పుడు ఒంగోలు నగరంలో ప్రవేశపె డుతున్నారు. మార్కెట్లోకి ప్రవేశించే వారు ఈ టన్నెల్లో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మిషన్ నుంచి వచ్చే ఆవిరి మనుష్యులపై ఉండే క్రిములు, ఇతర వైరస్లను నాశనం చేస్తుంది. ప్రకాశం భవనం, రైతు బ జార్లు వద్ద ఈ టన్నెల్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు మునిసిపల్ ఇంజనీర్ సుందరరామిరెడ్డి తెలిపారు.