సాంకేతిక సదస్సుల ద్వారా విజ్ఞాన మార్పిడి
ABN , First Publish Date - 2020-03-16T11:06:10+05:30 IST
సాంకేతిక సదస్సులు విద్యార్థుల విజ్ఞాన మార్పిడికి దోహదం చేస్తాయని జేఎన్టీయూ కాకినాడ డైరెక్టర్ డాక్టర్
ఎమర్జి-2020 ప్రారంభం
మార్కాపురం, మార్చి 15: సాంకేతిక సదస్సులు విద్యార్థుల విజ్ఞాన మార్పిడికి దోహదం చేస్తాయని జేఎన్టీయూ కాకినాడ డైరెక్టర్ డాక్టర్ జేవీఆర్ మూర్తి అన్నారు. స్థా నిక జార్జి ఇంజనీరింగ్ కళాశాలలోని మిలీ నియం ఆడిటోరియంలో ఆదివారం కళాశాల కార్యదర్శి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఎమ ర్జి-2020ను ప్రారంభించారు. డాక్టర్ జేవీఆర్ మూర్తి మాట్లాడుతూ విద్యార్థులు అపజయా న్ని ఎన్నడూ తిరస్కరించకూడదని, విజయా నికి సోపానాలుగా ఉపయోగించుకోవాల న్నారు.
కళాశాల కార్యదర్శి డాక్టర్ సతీష్ మాట్లాడుతూ విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞా నాన్ని పెంపొందించడానికి 14 సంవత్సరాలు గా ఎమర్జ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సుకు న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ ఎస్. శివారెడ్డి, పకీరయ్య, శ్రీనివాసరావు, జేవీఆర్ మూర్తి, గోపాలకృష్ణలు వ్యవహరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్ నారాయణ, రాజాబాబు, మస్తానయ్య, తదితరులు పాల్గొన్నారు.