దర్శిలో చోరీ
ABN , First Publish Date - 2020-03-08T10:53:38+05:30 IST
దర్శిలో చోరీ

రూ. 2లక్షల సొత్తు అపహరణ
దర్శి, మార్చి 7 : మండల కేంద్రంలోని లంకోజనపల్లి రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తాళాలు ప గులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు రూ. 2లక్షల సొత్తు ను అపహరించుకెళ్లారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లంకోజనపల్లి రోడ్డులో ఉంటున్న జి. వెంకటరత్నమ్మ రెండ్రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వేరే ఊరులో ఉంటున్న బంధువుల వద్ద కు వెళ్లింది.
దీన్ని గుర్తించిన దొంగలు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీ రువాలో ఉన్న ఐదు సవర్ల బంగారం, రూ. 20వేల నగదు తోపాటు మరికొన్ని చిన్నచిన్న వస్తువులు అపహరించు కెళ్లారు. ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని చూసిన స్థానికులు శనివారం వెంకటరత్నంకు సమాచారం ఇచ్చారు. దీంతో దర్శికి వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వి. ఆంజనేయులు సంఘటనా స్థలాన్ని పరిశీలించా రు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.