వెంటాడుతున్న కరోనా
ABN , First Publish Date - 2020-07-08T11:13:03+05:30 IST
పామూరులో కరోనా వ్యాప్తి పెరగకుండా అధికారులందరూ నివారణ మార్గాలు అన్వేషించి ప్రజలను రక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ చేతన్ సూచించారు.
పామూరులో...
పామూరులో కరోనా వ్యాప్తి పెరగకుండా అధికారులందరూ నివారణ మార్గాలు అన్వేషించి ప్రజలను రక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ చేతన్ సూచించారు. మూడు నెలల పాటు సేఫ్టీ జోన్గా ఉన్న పామూరు కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఇంతలా కేసులు పెరిగిపోవడం, పలు మరణాలు సంభవించడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో డీఎంహెచ్వో పద్మావతి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎన్ నరసింహారావు, తహసీల్దార్ సిహెచ్. సుబ్రమణ్యం, ఎంపీడీవో ఎం రంగసుబ్బరాయుడు, ఈఓఆర్డీ బ్రహ్మానందరెడ్డి, డాక్టర్లు రాజశేఖర్, కామాక్షయ్య, సాయి పద్మప్రశాంతి, సీఐ ఏఎస్ రామక్రిష్ణారెడ్డి, ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ యాదవ్ పాల్గొన్నారు.