చీరాలలో మరోసారి టెన్షన్ వాతావరణం..

ABN , First Publish Date - 2020-11-06T17:04:50+05:30 IST

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.

చీరాలలో మరోసారి టెన్షన్ వాతావరణం..

ఒంగోలు : ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితులుంటాయని ముందే గ్రహించిన పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి వర్గీయుల మధ్య జరుగుతాయనే నేపథ్యంలో ఆందోళన నెలకొంది. ప్రజా సంకల్ప యాత్రకు మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చీరాలలో కరణం వెంకటేష్, ఆమంచి కృష్ణమోహన్‌లు పాదయాత్ర నిర్వహించారు. ఇప్పటికే ఈ ఇరువురి వర్గీయుల మధ్య పలుమార్లు ఘర్షణలు చోటుచేసుకున్న సందర్భాలు కోకొల్లలు.


ఇవాళ కూడా ఆమంచి, కరణం వర్గాలు ఆధ్వర్యంలో పాదయాత్రలు జరుగుతుండటంతో మరోసారి గొడవలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ తరుణంలో భారీగా మోహరించిన పోలీసులు రెండు వర్గాలకు విడివిడిగా రూట్లు కేటాయించారు. దేశాయిపేట నుంచి చీరాల గడియార స్తంభం సెంటర్ వరకు ఆమంచి, చీరాల గడియార స్తంభం సెంటర్ నుంచి ఈపూరుపాలెం వరకు కరణం వెంకటేష్ పాదయాత్రలో పాల్గొననున్నారు. పాదయాత్రలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. పలువురు ఉన్నతాధికారులు దగ్గరుండి మరీ ఎలాంటి గొడవలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2020-11-06T17:04:50+05:30 IST