దేవస్థాన అభివృద్ధికి సహకరించాలి : డాక్టర్ ఉగ్ర
ABN , First Publish Date - 2020-12-12T04:30:01+05:30 IST
మండలంలోని అయ్యలూ రివారిపల్లిలో నిర్మిస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత తిరుమల నాథ స్వామి దేవస్థాన నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు.
సీఎస్పురం, డిసెంబరు 11 : మండలంలోని అయ్యలూ రివారిపల్లిలో నిర్మిస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత తిరుమల నాథ స్వామి దేవస్థాన నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. దాతల సహా యంతో దాదాపు రూ.200కోట్లతో నిర్మిస్తున్న దేవస్థాన పనులను శుక్ర వారం ఆయన పరిశీలించి పూజలు నిర్వహించారు. పురాతన దేవా లయ అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని ఉగ్ర అన్నారు. దాతలతోపాటు ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు. అయ్యలూరివారిపల్లి నుంచి దేవస్థానం వరకు డబుల్ తారురోడ్డు నిర్మిస్తే బాగుంటుందని మారుమూల ప్రాంతంలో అభివృద్ధి కార్యక్ర మాల నిర్వహణతో పర్యాటకంగా గుర్తింపు లభిస్తుందని ఉగ్ర తెలి పారు. ఆయనవెంట టీడీపీ నాయకులు బొబ్బూరి రమేష్, వెంకటరెడ్డి, శ్రీను తదితరులు ఉన్నారు.