టీచర్ల బదిలీ సీనియారిటీ జాబితా విడుదల
ABN , First Publish Date - 2020-12-03T05:37:23+05:30 IST
జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రాథమిక సీనియారిటీ జాబితాను బుధవారం మధ్యాహ్నం ప్రకటించారు. పాఠశాల వి ద్యాశాఖ డైరెక్టర్ ఆమోదంతో ఈ జాబితాను డీఈవో వీఎస్.సుబ్బారావు డీఈవో ప్రకాశం వెబ్సైట్లో ఉంచారు.

ఒంగోలువిద్య, డిసెంబరు 2 : జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రాథమిక సీనియారిటీ జాబితాను బుధవారం మధ్యాహ్నం ప్రకటించారు. పాఠశాల వి ద్యాశాఖ డైరెక్టర్ ఆమోదంతో ఈ జాబితాను డీఈవో వీఎస్.సుబ్బారావు డీఈవో ప్రకాశం వెబ్సైట్లో ఉంచారు. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు, అభ్యర్థన మేరకు బదిలీ కోరుకోనేవారు మొత్తం 5,624 మంది దరఖాస్తులు సమర్పించా రు. స్కూలు అసిస్టెంట్లు,సెకండరీ గ్రేడ్ టీచర్లు తత్సామాన కేడర్ ఉపాధ్యాయు ల బదిలీల సీనియారిటీ జాబితాలు ప్రకటించగా, హెచ్ఎంల బదిలీ సీనియారి టీ జాబితాలను ఆర్జేడీ ప్రకటించాల్సి ఉంది. జాబితాలపై ఏమైనా అభ్యంతరా లు ఉంటే తగు ఆధారాలతో వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను డీఈవోకు సమర్పించాల్సి ఉంటుంది. ఈనెల 5 ను ంచి 7వ రకు అభ్యంతరాల పరిశీలన జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ (అభివృ ద్ధి) ఆమో దంతో ఈ అభ్యంతరాలను డీఈవో పరిష్కరిస్తారు. ఈనెల 8 నుంచి 10వరకు బదిలీల తుది సీనియారిటీ జాబితాను పనితీరు పాయింట్లు ఎన్టైటి ల్మెంటు పాయింట్లు ప్రకటించనున్నారు.