రాజధాని రైతులకు సంఘీభావం
ABN , First Publish Date - 2020-08-15T11:19:09+05:30 IST
రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 241వ రోజుకు చేరిన సందర్భంగా వారికి
కందుకూరు, ఆగస్టు 14 : రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 241వ రోజుకు చేరిన సందర్భంగా వారికి కందుకూరు నియోజకవర్గ జేఏసీ సంఘీభావం తెలిపింది. మద్దతు తెలిపిన వారిలో జేఏసీ కన్వీనర్ గోచిపాతల మోషె టీడీపీ నాయకులు దామా మల్లేశ్వరరావు, కలవకూరి యానాది, తలారి మల్లికార్జున, కాకుమాని వాసు, రెబ్బవరపు మాల్యాద్రి, బెజవాడ ప్రసాద్ తదితరులున్నారు.