పాఠశాలలో సరస్వతీ విగ్రహం ఏర్పాటు
ABN , First Publish Date - 2020-12-25T06:29:11+05:30 IST
మండలంలోని రామచంద్రకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సరస్వతీ విగ్రహ ప్రతిష్ఠ చేశారు.
పెద్ద దోర్నాల, డిసెంబరు 24 : మండలంలోని రామచంద్రకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సరస్వతీ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ప్రదానోఫాధ్యాయులు ఎన్.శ్రీనివాసరావు అధ్యక్షతన గ్రామానికి చెందిన మునగంటి వంశస్థులు సహకారంతో సరస్వతీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలకు స్థలాన్ని కూడా మునగంటి వంశస్థులు ఇవ్వడం అభినందనీయమని గ్రామ ప్రజలు, ప్రధానోఫాధ్యాయులు, ఉఫాధ్యాయ సిబ్బంది పేర్కొన్నారు.