నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

ABN , First Publish Date - 2020-12-01T06:05:30+05:30 IST

తుఫాన్‌ వలన పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ పేర్కొన్నారు.

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
పాపిరెడ్డిపాలెంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న మద్దిశెట్టి

దర్శి, నవంబరు 30 : తుఫాన్‌ వలన పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం  అండగా ఉంటుందని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ పేర్కొన్నారు. మండలంలోని పాపిరెడ్డిపాలెం, బొట్లపా లెం గ్రామాల్లో దెబ్బతిన్న వరిపంటను ఆయన పరిశీలించారు. బోర్లకింద సాగుచేసిన వరిపంట కోతకొచ్చిన సమయంలో తుఫాన్‌తో నేలకొరిగి నీటిపాలైందని రైతులు ఆవేదనలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకుడు మద్దిశెట్టి రవీంద్ర, ఏడీఏ కె.అర్జున్‌నాయక్‌, తహసీల్దార్‌ వీడీబీ వరకుమార్‌, ఎంపీడీవో గుత్తా శోభన్‌బా బు, వ్యవసాయాధికారి బాలకృష్ణానాయక్‌,  కె.అంజిరెడ్డి, యస్‌ తిరుపతిరెడ్డి, వైవి సుబ్బయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T06:05:30+05:30 IST