అర్హులైన విద్యార్థులకు విద్యాదీవెన వర్తింపజేయాలి

ABN , First Publish Date - 2020-12-30T05:27:08+05:30 IST

రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సం స్థల్లో పీజీ చదివే విద్యార్థులకు విద్యాదీవెన, వసతిదీవెన పథకాలను అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నా యకులు డిమాండ్‌ చేశారు.

అర్హులైన విద్యార్థులకు విద్యాదీవెన వర్తింపజేయాలి
మాట్లాడుతున్న నాయకులు

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 29 : రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సం స్థల్లో పీజీ చదివే విద్యార్థులకు విద్యాదీవెన, వసతిదీవెన పథకాలను అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నా యకులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన 77 జీవోను  రద్దు చేయాలని  కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలు లోని ప్రజాసంఘాల కార్యాలయంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం టి.ప్ర వీణ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌.వినోద్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌.రాజశే ఖర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నగర అధ్యక్షుడు రామ్మూర్తి, డీవైఎఫ్‌ఐ కార్యదర్శి కే ఎఫ్‌.బాబు, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి బి.రఘురాం మాట్లాడారు. ఎన్ని కల సమయంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య తమ బాధ్య తని చెప్పిన సీఎం జగన్‌, అధికారంలోకి వచ్చాక ఆ పథకాలను తొల గించడం దారుణమని వారు విమర్శించారు. కార్యక్రమంలో ఏడుకొం డలు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-30T05:27:08+05:30 IST