పడిగాపుల రేషన్‌

ABN , First Publish Date - 2020-11-21T05:48:21+05:30 IST

షన్‌షాపుల వద్ద గంటల తరబడి కార్డుదారులు సరుకులు కోసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పడిగాపుల రేషన్‌

నాలుగు రోజుల్లో 23.04శాతం మందికి అందిన సరుకులు 

గంటల తరబడి రేషన్‌షాపుల వద్ద కార్డుదారులు 

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 20: రేషన్‌షాపుల వద్ద గంటల తరబడి కార్డుదారులు సరుకులు కోసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నాలుగు రోజుల నుంచి సరుకులు ఇస్తున్నా సర్వర్‌ సక్రమంగా పనిచేయక సరుకులు అందని పరిస్థితి ఏర్పడింది. దీంతో కార్డుదారులు వేలిముద్రలు వేసి సరుకులు తీసుకోనేందుకు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో గత రెండు నెలల నుంచి ఇదేవిధంగా సర్వర్‌ మొరాయిస్తున్నా పౌరసరఫరాల అధికారులు పరిష్కారమార్గం ఇంతవరకు చూడకపోవడంతో కార్డుదారులు ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 16వవిడత రేషన్‌ పంపిణీ గత మంగళవారం నుంచి ప్రారంభమైనా శుక్రవారం సాయంత్రానికి కేవలం 23.04శాతం మందికి మాత్రమే సరుకులు అందాయంటే సర్వర్‌ ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 


Updated Date - 2020-11-21T05:48:21+05:30 IST