అనాథలకు ఆహారం అందజేత
ABN , First Publish Date - 2020-03-25T10:15:25+05:30 IST
కరోనా వైరస్ ప్రభావంతో హోటళ్లు, షాపులన్నీ మూసివేస్తున్నారు. దీంతో బిచ్చగాళ్లు, అనాథలు భోజన వసతి లేక ఇబ్బంది
పామూరు, మార్చి 24 : కరోనా వైరస్ ప్రభావంతో హోటళ్లు, షాపులన్నీ మూసివేస్తున్నారు. దీంతో బిచ్చగాళ్లు, అనాథలు భోజన వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. వారికి పామూరు మాజీ సర్పంచ్ కావిటి సుబ్బయ్య, వ్యాపార వేత్త హాజీ గౌస్, బియ్యం, వ్యాపారి చిన్న హాజీ మలాన్ ఆహారం అందజేస్తున్నారు. 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని వారు తెలిపారు.