నిర్వాసితుల పరిహారం చెల్లింపునకు సిద్ధం

ABN , First Publish Date - 2020-08-14T11:32:05+05:30 IST

వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు వన్‌టైం సె టిల్‌మెంట్‌ కింద నష్టపరిహా రం చెల్లించడానికి ప్రభుత్వం సి ద్ధంగా ఉందని మా

నిర్వాసితుల పరిహారం చెల్లింపునకు సిద్ధం

కంభం (అర్థవీడు), ఆగస్టు 13 :  వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు వన్‌టైం సె టిల్‌మెంట్‌ కింద నష్టపరిహా రం చెల్లించడానికి ప్రభుత్వం సి ద్ధంగా ఉందని మార్కాపురం ఆ ర్డీవో ఎం.శేషిరెడ్డి తెలిపారు. గు రువారం ఆయన వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన అర్థవీడు మండలం కృష్ణానగర్‌ను సందర్శించారు.  ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిర్వాసితుల అంగీకారం మేరకు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.12.50లక్షలు లేదా గృహ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు.


నిర్వాసితులు ఆ పరిహారానికి అంగీకరించారని తెలిపారు. అదేవిధంగా ముంపు గ్రామాల నిర్వాసితులు కూడా ముందుకు వస్తే నష్టపరిహారం చెల్లిస్తామని ఆర్డీవో తెలిపారు. ఆయనవెంట ప్రాజెక్టు భూసేకరణ కంభం యూనిట్‌ డీటీ శ్రీనివాసరావు, అర్థవీడు తహసీల్దార్‌ కోటేశ్వరరావు, ఆర్‌ఐ శ్రీను ఉన్నారు. 

Updated Date - 2020-08-14T11:32:05+05:30 IST