ప్రకాశం జిల్లాలో కొత్తగా 317 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-10-24T12:34:28+05:30 IST
ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. జిల్లాలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. జిల్లాలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 57,953 కి చేరింది. ఒంగోలులో అత్యధికంగా 38 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా భారిన పడి ఇద్దరు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 566 మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 71 మంది డిశ్చార్జ్ అయ్యారు. 32 మందిని హోం ఐసోలేషన్కు పంపారు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్లలో ప్రస్తుతం 2730 యాక్టివ్ కేసులు ఉన్నాయి.