-
-
Home » Andhra Pradesh » Prakasam » prakasam
-
‘నివర్’ తుపాన్...అధికారుల అప్రమత్తం
ABN , First Publish Date - 2020-11-25T12:40:10+05:30 IST
‘నివర్’ తుపాను నేపథ్యంలో జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ప్రకాశం: ‘నివర్’ తుపాను నేపథ్యంలో జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతంలో ఉన్న 11 మండలాలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒంగోలు కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ 1077 ఏర్పాటు చేశారు. తుపాను నేపథ్యంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. తీర ప్రాంత ప్రజలను మెరైన్ పోలీసులు అప్రమత్తం చేశారు.