మరోసారి ఈకేవైసీ

ABN , First Publish Date - 2020-06-07T07:52:42+05:30 IST

రేషన్‌ కార్డులను మరోసారి గ్రామ, వార్డు వలంటీర్లు ఎలకా్ట్రనిక్‌ నో యువర్‌ కస్టమర్‌(ఈకేవైసీ) చేస్తున్నారు.

మరోసారి ఈకేవైసీ

రేషన్‌ కార్డుదారులందరి వేలిముద్రల సేకరణ

నమోదు చేస్తున్న వలంటీర్లు

జిల్లాకు  వచ్చిన 8.05 లక్షల కార్డులు

అనేక ప్రాంతాల్లో పంపిణీలో జాప్యం


ఒంగోలు (కలెక్టరేట్‌), జూన్‌ 6 : రేషన్‌ కార్డులను మరోసారి గ్రామ, వార్డు వలంటీర్లు ఎలకా్ట్రనిక్‌ నో యువర్‌ కస్టమర్‌(ఈకేవైసీ) చేస్తున్నారు. ఇంటింటికీ రేషన్‌ బియ్యం పంపిణీలో భాగంగా ఇప్పటికే గ్రామ సచివాలయాలకు రేషన్‌కార్డులను మ్యాపింగ్‌ చేశా రు. ఇప్పుడు వలంటీర్ల పరిధిలోని రేషన్‌కార్డులకు ఈకేవైసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రానున్న రోజుల్లో వలంటీర్ల ద్వారానే రేషన్‌ బియ్యం పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను వారితోనే చేపట్టారు.


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక రేషన్‌కార్డులను మార్చేశారు. గతంలో రేషన్‌కార్డులనే ఆరోగ్యశ్రీకి కూడా వినియోగించే వారు. అయితే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కార్డులను వేరు గా ఇచ్చి రేషన్‌కు మాత్రం ప్రత్యేకంగా బియ్యం కా ర్డులు ఇస్తున్నారు. అయితే జిల్లాలో 9.91 లక్షల మం ది కార్డుదారులు ఉండగా ఇప్పటికే జిల్లాకు 8.05ల క్షల కొత్త రేషన్‌కార్డులు వచ్చాయి. వాటి పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒంగోలులోనే 20వేల వరకు పంపిణీ చేయాల్సి ఉంది. 

Updated Date - 2020-06-07T07:52:42+05:30 IST