నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-03-27T10:15:34+05:30 IST

మార్కెట్లో వ్యాపారులు నిత్యవసర సరుకులు, కూరగాయలను అధికధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్ధార్‌ ఎమ్‌.రాజ్‌కుమార్‌

నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

సిటీ న్యూస్:  మార్కెట్లో వ్యాపారులు నిత్యవసర సరుకులు, కూరగాయలను అధికధరలకు విక్రయిస్తే  చర్యలు తీసుకుంటామని తహసీల్ధార్‌ ఎమ్‌.రాజ్‌కుమార్‌ గురువారం హెచ్చరించారు. వీధుల్లో అనవసరంగా సంచరించినా, వాహనాల్లో ప్రయాణించిన తక్షణమే  అరెస్టు చేయిస్తామని హెచ్చరించారు. కిరాణాషాపులు, పాలప్యాకెట్లు, పండ్లు, కూరగాయల షాపుల వ్యాపారులు తప్పనిసరిగా అనుమతిపత్రాలను సంబంధిత పంచాయతీ కార్యాలయాల్లో తీసుకోవాలన్నారు. నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడానికి వచ్చే ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

Updated Date - 2020-03-27T10:15:34+05:30 IST