విధిగా మాస్కులు ధరించాలి
ABN , First Publish Date - 2020-12-15T05:30:00+05:30 IST
కరోనా నేపథ్యంలో ఎవరూ నిర్లక్ష్యం వహించకుండా ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని పాలకవీడు పంచాయతీ కార్యదర్శి అహల్యరాణి అన్నారు.
రాచర్ల, డిసెంబరు 15 : కరోనా నేపథ్యంలో ఎవరూ నిర్లక్ష్యం వహించకుండా ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని పాలకవీడు పంచాయతీ కార్యదర్శి అహల్యరాణి అన్నారు. పొగాకు జీపీఐ కంపెనీ ఆధ్వర్యంలో అనుమలవీడు గ్రామంలో 1200 మంది జనాభాకు ఉచితంగా మాస్కులు సరఫరా చేశారు. వాటిని మంగళవారం పంచాయతీ కార్యదర్శి అహల్యరాణి వలంటీర్ల ద్వారా ఇంటింటికి అందజేశారు. కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ వెంకటేశ్వర్లు, ఎఫర్డ్ సంస్థ సమన్వయకర్త జయరావు, వలంటీర్లు అలీ, షికూర్, తదితరులు పాల్గొన్నారు.