పక్కాగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-04-28T10:33:19+05:30 IST

జిల్లాలో 36వ రోజైన సోమవారం కూడా లాక్‌డౌన్‌ సంపూ ర్ణంగా కొనసాగింది.

పక్కాగా లాక్‌డౌన్‌

ఇళ్లకే పరిమితమైన ప్రజలు 

ఆసుపత్రులను తనిఖీ చేసిన అధికారులు 


ఒంగోలు, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 36వ రోజైన సోమవారం కూడా లాక్‌డౌన్‌ సంపూ ర్ణంగా కొనసాగింది. అత్యధిక శాతం మంది ప్రజా నీకం స్వీయ నియంత్రణ పాటించి ఇళ్లకే పరిమిత య్యారు. అదే సమయంలో  ఆయా ప్రాంతాల్లో పోలీసు తనిఖీలు ముమ్మరంగా సాగాయి. ప్రధా నంగా భౌతిక దూరం పాటింపుపై దృష్టి పెట్టడం తోపాటు, అత్యవసర పనులు లేకుండా వీధుల్లోకి వస్తున్న వారిని ఎక్కడికక్కడ నియంత్రించారు. రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్‌లుగా ప్రకటించిన ప్రాంతా ల్లో ఈ కట్టడి అధికంగా ఉంది.  కొన్ని పట్టణాల్లో ని ఆస్పత్రులను అధికారులు తనిఖీ చేసి భౌతిక దూరం పాటింపు, ఇతరత్రా అంశాలపై పలు సూచనలు చేశారు. 

Updated Date - 2020-04-28T10:33:19+05:30 IST