శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2020-12-21T04:35:28+05:30 IST
శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు తప్పవని ఎస్పీ సిద్ధార్థకౌశల్ హెచ్చరించారు.

చీరాల, డిసెంబరు 20 : శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు తప్పవని ఎస్పీ సిద్ధార్థకౌశల్ హెచ్చరించారు. పోలీసులు, ప్రజలు పరస్పర సహకారంతో నేరనియంత్రణలో ముందడుగు వేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. స్థానిక ఒన్టౌన్ పోలీ్సస్టేషన్లో ఆదివారం ఆయన నియోజకవర్గ స్థాయిలో ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భవిష్యత్ కార్యాచరణపై డీఎస్పీ శ్రీకాంత్, ఎస్బీ సీఐ సూర్యనారాయణ, ఒన్టౌన్, టూటౌన్, రూరల్, ఇంకొల్లు సీఐలు రాజమోహన్, రోశయ్య, పాపారావు, అల్తా్ఫహుస్సేన్తో సమీక్షించారు.