భూసేకరణ వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-06-25T11:09:40+05:30 IST
జిల్లాలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయడంతో పాటు కాలనీల అభివృద్ధిపై ప్రత్యేక

ఒంగోలు(కలెక్టరేట్), జూన్ 24 : జిల్లాలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయడంతో పాటు కాలనీల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జేసీ-1 వెంకట మురళీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆర్డీవోలు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు.వచ్చేనెల 8వతేదీన ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టిందన్నా రు. ఆ లోపు ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు.