ప్రతిభావంతులకు జిందాల్‌ సంస్థ చేయూత

ABN , First Publish Date - 2020-03-16T11:06:45+05:30 IST

పేదరికం కారణంగా ప్రతిభావంతులైన యువత భవిష్యత్‌ కొల్పోకూడదనే సదుద్ధేశంతో చేయూతనిస్తున్న జిందాల్‌ సంస్థ సేవలు అభి నందనీయమని శ్రీ

ప్రతిభావంతులకు జిందాల్‌ సంస్థ చేయూత

మార్కాపురం(వన్‌టౌన్‌), మార్చి 15: పేదరికం కారణంగా ప్రతిభావంతులైన యువత భవిష్యత్‌ కొల్పోకూడదనే సదుద్ధేశంతో చేయూతనిస్తున్న జిందాల్‌ సంస్థ సేవలు అభి నందనీయమని శ్రీ సాధన విద్యాసంస్థల డైర క్టర్‌ ఎన్‌వీ కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక శ్రీ సా ధన డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు జిందాల్‌ సంస్థ పంపిన 2వ విడుత చెక్కులను ఆది వారం అందించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కప్పగంతుల మధుసూదన్‌ మాట్లాడుతూ ప్రతిభ పేదరికం ప్రాతిపదికన జిందాల్‌ సంస్థ ఈ విద్యా సంవ త్సరంలో ఎక్కువ మంది విద్యార్థులకు నగదు పురస్కారాలతో చేయూత నిచ్చిందన్నారు.


కరువు ప్రాంతమైన పశ్చిమ ప్రకాశంలో ప్రతిభ  ఉన్న విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధిం చేందుకు జిందాల్‌ సంస్థ ప్రేరణగా నిలిస్తుందన్నారు. నెలకు ఒక్కొకరికి రూ.800 నుంచి రూ.1000 చొప్పున ఈ విద్యాసంవత్సరం ద్వితీయార్థానికి 13 మంది విద్యార్థుకు నగదు చెక్కులు ఇవ్వడం అభినం దనీయమన్నారు. ఇచ్చిన సహకారాన్ని సద్విని యోగం చేస్తూ సామాజిక బాధ్యతను అలవాటు చేసుకోవాలని డైరక్టర్లు రాజగోపాల్‌ రెడ్డి, వీఆర్‌కె ప్రసాద్‌, వెన్నా కృష్ణారెడ్డిలు అన్నారు. 

Updated Date - 2020-03-16T11:06:45+05:30 IST