పేదల సొంతింటి కల నెరవేర్చుతాం

ABN , First Publish Date - 2020-12-29T04:42:41+05:30 IST

పేదల సొం తింటి కలను నెరవేరుస్తామని ఎమ్మెల్యే కుం దురు నాగార్జునరెడ్డి అన్నారు.

పేదల సొంతింటి కల నెరవేర్చుతాం
పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి


ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

తర్లుపాడు, డిసెంబరు 28 : పేదల సొం తింటి కలను నెరవేరుస్తామని ఎమ్మెల్యే కుం దురు నాగార్జునరెడ్డి అన్నారు. మండల కేంద్రమైన తర్లుపాడుతోపాటు సీతానాగు లారం, తుమ్మలచెరువు, సూర్యపల్లెలో సోమ వారం ఆయన పేదలకు నివేశన స్థల పట్టా లను అందజేశారు. ఈ సందర్భంగా జగనన్న కాలనీల శిలాఫలకాలను  కూడా ఆవిష్క రించారు. అనంతరం నాగార్జునరెడ్డి మాట్లా డుతూ పార్టీలకతీతంగా అర్హత ఉన్న పేద వారికి ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందన్నా రు. ఆర్డీవో శేషిరెడ్డి మాట్లాడుతూ మార్కా పురం నియోజకవర్గంలో 441 ఎకరాల ప్రభు త్వ భూమిలో ఇళ్ల పట్టాలను ఇచ్చామని చె ప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శైలేంద్ర కుమార్‌, హౌసింగ్‌ డీఈ పవన్‌కుమార్‌, ఎంపీడీవో ఎస్‌.నరసింహులు, ఎంఈవో డి.సుజాత, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పా ల్గొన్నారు. 

సీఎస్‌పురంలో..

సీఎస్‌పురం : అర్హులైన ప్రతి పేదకూ స్థల మిచ్చి, ఇంటి నిర్మాణం చే యడం జరుగుతుందని ఎమ్మెల్యే మధు సూదన్‌ యాదవ్‌ అన్నారు. మండలంలోని పెదగోగు లపల్లి, అంబవరం కొత్తపల్లి, చెన్నపు నాయునిపల్లి, అంబవరం, అయ్య లూరి వారిపల్లి, బోయమ డుగుల, పులగూ రిపల్లి, పెదరాజుపాలెం తదితర గ్రామాల్లో లబ్ధిదారులకు ఇంటి పట్టాల ను సోమ వారం ఆయ న పంపిణీ చేశారు. కార్య క్రమంలో తహ సీల్దార్‌ బీ.వీ.రమణా రావు, ఎంపీడీవో కట్టా శ్రీనువాసులు, ఏపీవో సుబ్బారావు, ఏపీఎం రజని,  ఎంపీపీ అభ్యర్థి మూడమంచు వెంకటేశ్వర్లు,  మండల కన్వీ నర్‌ కొండ్రాజు వెంకటేశ్వర్లు, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి  బుజ్జి, మాజీ సర్పంచ్‌ వెంక టేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-29T04:42:41+05:30 IST