రూ.5 లక్షల గుట్కాలు స్వాధీనం
ABN , First Publish Date - 2020-07-17T11:20:19+05:30 IST
పట్టణంలోని కళాశాల రోడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.5 లక్షల రూపాయల విలువచేసే గుట్కాలను ..
మార్కాపురం, జూలై 16 : పట్టణంలోని కళాశాల రోడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.5 లక్షల రూపాయల విలువచేసే గుట్కాలను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. దొనకొండ మండలం లక్ష్మీపురంకు చెందిన సూరే సత్యం అలియాస్ ప్రసాద్ ఐదు నెలల నుంచి కళాశాల రోడ్డులో గోడౌన్ను తీసుకొని అక్రమంగా గుట్కాలు నిల్వ ఉంచి పట్టణంలో వ్యాపారం చేస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఎస్బీ హెడ్ కానిస్టేబుళ్లు బి.ఆవులయ్య, శ్రీనివాసులు గురువారం ఉదయం దాడి చేసి రూ.5 లక్షల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకొన్నారు. నిందితుని అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.