నేడు 7 కేంద్రాల్లో ఈసెట్
ABN , First Publish Date - 2020-09-14T10:14:41+05:30 IST
ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సం వత్సరంలో ప్రవేశించేందుకు ..
ఒంగోలువిద్య, సెప్టెంబరు 13 : ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సం వత్సరంలో ప్రవేశించేందుకు సోమవారం ఈసెట్-2020 జరుగుతుంది. ఈ పరీక్ష నిర్వహ ణ కోసం జిల్లాలోని ఏడు ఇంజనీరింగ్ కళాశా లల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంగో లులో 3, పేస్, రైజ్-2, చీమకుర్తి బీవిఎస్ఆర్, చీరాల నాయనపల్లిలోని ఇయాంజోన్, మార్కా పురం కిట్స్, శామ్యూల్జార్జి ఇంజనీరింగ్ కళా శాలల్లో పరీక్షలు జరుగుతాయి.
మొత్తం 1,750 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష రెండు షిప్టుల్లో ఉదయం 9 నుంచి 12వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6గంటల వరకు జరుగు తుంది. పరీక్ష నిర్వహణలో కొవిడ్ నిబంధనల ను పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. మాస్కు ధరించి, శానిటైజ్ చేసిన తరువాతే అభ్యర్థుల ను లోపలికి పంపిస్తారు. కంప్యూటర్ లాబ్లన్ర్నింటిని శానిటైజ్ చేసి పరీక్ష నిర్వహణకు సిద్ధంగా ఉంచారు. ఈ సం దర్భంగా పరీక్షల నిర్వహణ అధికారులు మాట్లాడుతూ అభ్యర్థులు పరీక్షా కేంద్రా నికి కనీసం గంటన్నర ముందుగా చేరు కోవాలని సూచించారు.