పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ABN , First Publish Date - 2020-12-01T06:10:46+05:30 IST
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.
వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కృష్ణ చైతన్య
అద్దంకి, నవంబరు 30: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. వస్త్ర దుకాణాల యజమానుల సహకారంతో సమకూర్చిన వెయ్యి సం చులను, పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోటులను పంపిణీ చేశారు. అనంతరం ఫాగింగ్ యంత్రాలను ఆయన ప్రారంభించారు. నగర పంచాయతీ కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణచైతన్య మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని అందరూ స్వచ్ఛం దంగా మానుకొని, కాటన్ సంచులను ఉపయోగించాలని కోరారు. కార్యక్రమంలో నగరపంచాయతీ కమిషనర్ ఫజులుల్లా, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు కాకాని రాధాకృష్ణమూర్తి, కోట శ్రీనివాసకుమార్ పాల్గొన్నారు.
స్థానిక కాకానిపాలెంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ నుంచి రూ.3.6 కోట్ల నిధులు మంజూరైనట్లు కృష్ణ చైతన్య తెలిపారు. కోటి రూపాయలు భక్తులు విరాళంగా ఇవ్వనుండగా, టీటీడీ రూ.2.6 కోట్లతో కలిపి మొత్తం రూ.3.6కోట్లతో ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.