ఈ-కర్షక్ ద్వారా బహుళ ప్రయోజనాలు : జేసీ
ABN , First Publish Date - 2020-07-16T10:26:10+05:30 IST
ఈఇ-కర్షక్ ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, సాగు చేసిన పంటలను నమోదు చేయించు కోవాలని ..
కొత్తపట్నం, జూలై 15: ఈఇ-కర్షక్ ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, సాగు చేసిన పంటలను నమోదు చేయించు కోవాలని జాయింట్కలెక్టర్-1 వెంకటమురళి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని గమళ్ళపాలెంలోని వేరుశనగ పైరును ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులకు విత్తనాలు రాయితీపై అందజేస్తారని, బీమా, రై తు భరోసా, పంటల స్థిరీకరణనిధి వర్తిస్తుంద ని ఆయన వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పున్నారావు, ఏవో సుచరిత, సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు (రూరల్): రైతులు తాము సాగు చేసిన ప్రతి పంటనూ ఈ-కర్షక్లో నమోదు చేయించుకోవాలని ఆర్డీవో ప్రభాకరరెడ్డి సూ చించారు. బుధవారం ఒంగోలు మండలం యరజర్ల, మంగళాద్రిపురం గ్రామాల్లో సాగు చేసిన ఉద్యానవన, సాధారణ పంటలను ఈ- కర్షక్లో నమోదు చేసే విధానాన్ని ఆయన ప రిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె. చిరంజీవి పాల్గొన్నారు.
తాళ్లూరు: మండలంలోని శివరాంపురంలో ఈ-కర్షక్ యాప్ ద్వారా జరుగుతున్న ఈ-క్రా ప్ నమోదు తీరును జేడీఏ పి.శ్రీరామమూర్తి పరిశీలించారు. ప్రత్యేకాధికారి సుబ్బారెడ్డి, త హసీల్దార్ పి.బ్రహ్మయ్య, ఏవో సంగమేశ్వరరెడ్డి, డీటీ ఎస్.రామ్మోహనరావు పాల్గొన్నారు.
మద్దిపాడు : స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఈ-కర్షక్ నమోదుపై జేడీఏ శ్రీరామమూర్తి సంబంధిత అధికారులతో సమీ క్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏవో ర మేష్బాబు, విస్తరణాధికారి శేషారావు, రత్న సాగర్, సిబ్బంది పాల్గొన్నారు.