లయన్స్ క్లబ్కు మాజీ మంత్రి శిద్దా విరాళం
ABN , First Publish Date - 2020-11-26T05:37:35+05:30 IST
లయన్స్ క్లబ్కు మాజీ మంత్రి శిద్దా విరాళం

ఒంగోలు(కలెక్టరేట్), నవంబరు 25 : లయన్స్క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మూల నిధికి ప్రోగ్రెసిస్ మెల్విన్ జోన్స్ సభ్యత్వం కోసం వెయ్యి యూఎస్ డాలర్లు(75వేల విరాళం)ను లయన్స్ క్లబ్ ప్రతినిధులకు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు అందజేశారు. స్థానిక మంగమూరు రోడ్డులోని ఆయన నివాసంలో బుధవారం ఈ విరాళాన్ని లయన్స్ జిల్లా గవర్నర్ విజయకుమార్రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేబినెట్ సెక్రెటరీ లయన్ లక్ష్మీనారాయణ రావిపూడి ఉన్నారు.