క్రికెట్ పోటీల్లో జిల్లా జట్టు ప్రతిభ
ABN , First Publish Date - 2020-02-20T11:00:30+05:30 IST
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలలో ప్రకాశం జిల్లా జట్టు ప్రతిభ కనపరిచింది. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో గత మూడు రోజులుగా
గిద్దలూరు, ఫిబ్రవరి 19 : రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలలో ప్రకాశం జిల్లా జట్టు ప్రతిభ కనపరిచింది. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో గత మూడు రోజులుగా స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో అండర్-14 విభాగంలో ప్రకాశం జిల్లా జట్టు 3వ స్థానంలో నిలిచింది. గత 15 రోజులుగా జిల్లా జట్టుకు గిద్దలూరులోని గుర్రం ఆల్ఫ్రెడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే.
జిల్లా జట్టులోని హరిబాబు, రోహన్, సోనీ, జేమ్స్, జశ్వంత్ అనే క్రీడాకారులు అత్యున్నత ప్రతిభ కనపరిచారు. ఈ నలుగురు క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్టు ప్రకటించారు. అలాగే గుర్రం ఆల్ఫ్రెడ్ క్రికెట్ ఫౌండేషన్ నుంచి శిక్షణ పొందిన స్థానిక క్రీడాకారుడు హరిబాబు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై ఫౌండేషన్ నిర్వాహకులు గుర్రం శోభన్బాబు, కోచ్ చెన్నకేశవులు హర్షం వ్యక్తంచేశారు.