పెంచిన ఆస్తి పన్నులు వెంటనే తగ్గించాలి
ABN , First Publish Date - 2020-12-12T05:25:14+05:30 IST
పెంచిన ఆస్తి పన్నులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు.
టీడీపీ శ్రేణుల ధర్నా
గిద్దలూరు, డిసెంబరు 11 : పెంచిన ఆస్తి పన్నులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. ప్లాకార్డులతో నినాదాలు చేశారు. కరోనా కారణంగా ప్రజల ఆర్థిక స్థితి దిగజారిపోగా ఈ సందర్భంగా పట్టణాల్లో పన్నులు పెంచడం ఎంతవరకు సబబని పలువురు టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలపై భారం మోపే నిర్ణయంగా విమర్శించారు. పెంచిన పన్నులు వెంటనే తగ్గించకపోతే ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్, మాజీ కౌన్సిలర్ మేడం వెంకటస్వామి, టీడీపీ నాయకులు పెద్దభాషా, జి.గోపాల్రెడ్డి, ఎం.వెంకటరామిరెడ్డి, సయ్యద్ వలి, డానియేలు, సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.