గృహాలను ఖాళీ చేయాల్సిందే
ABN , First Publish Date - 2020-08-09T11:06:02+05:30 IST
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందుకున్న వారంతా ఇళ్లను ఖాళీ చేయాల్సిందదేనని కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు.
అక్టోబరు చివరి నాటికి వినుకొండకు నీరు: కలెక్టర్
కంభం (అర్థవీడు), ఆగస్టు 8 : ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందుకున్న వారంతా ఇళ్లను ఖాళీ చేయాల్సిందదేనని కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. శనివారం ఆయన అర్థవీడు మండలం కాకర్ల డ్యాం పరిధిలోని ముంపునకు గురయ్యే రామలింగేశ్వరపురం, క్రిష్ణానగర్, లక్ష్మీపురంలను సందర్శించారు. రామలింగేశ్వరపురంలోని 35 కుటుంబాల వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ కింద రూ.3.60కోట్లు మంజూరైనందున ఆ గృహాల వారిని కలెక్టర్ దగ్గర ఉండి ఖాళీచేయించారు. అలాగే క్రిష్ణానగర్, లక్ష్మీపురంలోని 250కుటుంబాల వారికి కూడా వారంలోగా ప్యాకేజీ మంజూరవుతుందన్నారు. వారు కూడా గ్రామాలు ఖాళీ చేయాలని కోరారు. అక్టోబరు చివరి నాటికి వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ నుంచి కాకర్ల డ్యాంకు నీరు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట జేసీ వెంకటమురళి, డిప్యూటీ కలెక్టర్ గంగాధర్గౌడ్, ఆర్డీవో శేషిరెడ్డి ఉన్నారు.