బాలినేనిపై అసత్యప్రచారంపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-07-17T11:20:51+05:30 IST

సోషల్‌ మీడియాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డిలపై అసత్యప్రచారం చేయడం ..

బాలినేనిపై అసత్యప్రచారంపై కేసు నమోదు

ఒంగోలు (క్రైం), జూలై 16 : సోషల్‌ మీడియాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డిలపై అసత్యప్రచారం చేయడం మీద వైసీపీ నాయకులు పోలీసును ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం తాలుకా పోలీస్‌ స్టేషన్‌లో పార్టీ నగరం అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు ఫిర్యాదు చేశారు. అసత్య ప్రచార పోస్టింగులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మణ్‌ చెప్పారు.

Updated Date - 2020-07-17T11:20:51+05:30 IST