బాలినేనిపై అసత్యప్రచారంపై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-07-17T11:20:51+05:30 IST
సోషల్ మీడియాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్రెడ్డిలపై అసత్యప్రచారం చేయడం ..
ఒంగోలు (క్రైం), జూలై 16 : సోషల్ మీడియాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్రెడ్డిలపై అసత్యప్రచారం చేయడం మీద వైసీపీ నాయకులు పోలీసును ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం తాలుకా పోలీస్ స్టేషన్లో పార్టీ నగరం అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు ఫిర్యాదు చేశారు. అసత్య ప్రచార పోస్టింగులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మణ్ చెప్పారు.