అగ్నిప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
ABN , First Publish Date - 2020-11-26T06:05:55+05:30 IST
అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఆందోళన పడకుండా ఆలోచనాత్మకంగా వ్యవహరించాలని కంభం అగ్నిమాపక శాఖ అధికారి బి.వెంకటరామయ్య తెలిపారు.

కంభం, నవంబరు 25 : అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఆందోళన పడకుండా ఆలోచనాత్మకంగా వ్యవహరించాలని కంభం అగ్నిమాపక శాఖ అధికారి బి.వెంకటరామయ్య తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అగ్ని ప్రమాదాల నివారణ, అప్రమత్తత, భద్రతలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అగ్నిమాపక సిబ్బంది మాక్డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మాల్యాద్రి, సీఆర్పీ మురళీమోహన్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
త్రిపురాంతకం : అగ్ని ప్రమాదాలు జరిగినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై వైపాలెం అగ్నిమాపక సిబ్బంది ఆధ్వ ర్యంలో విద్యార్ధులకు అవగాహనా కార్యక్రమం రామసముద్రం జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగింది. ఈసందర్బంగా పలు రకాల జాగ్రత్తలను విద్యార్ధుల ద్వారా ప్రదర్శన చేయుంచారు. ఈకార్యక్రమంలో అగ్నిమాపక అధికారి టి.వెంకటేశ్వర్లు, సిబ్బంది, ప్రదానోపాద్యాయులు బహదూర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.