రిమ్స్ నుంచిపరారైన పాజిటివ్ వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-08-15T11:17:55+05:30 IST
ఒంగోలులోని రిమ్స్ నుంచి పరారైన పాజిటివ్ సోకిన వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు
ఒంగోలు (కార్పొరేషన్) ఆగస్టు 14 : ఒంగోలులోని రిమ్స్ నుంచి పరారైన పాజిటివ్ సోకిన వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. రిమ్స్లోని ఐసోలేషన్లో వైద్యం పొందుతున్న ముగ్గురు వ్యక్తులు గురువారం పారారైన విషయం విధితమే. అయితే వారిలో రాచర్ల మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులను తిరిగి ఐసోలేషన్కు తరలించగా, మరో వ్యక్తి ఆచూకి లభించలేదు. అదే రోజు సాయంత్రం స్థానిక దక్షిణ బైపాస్ రోడ్డులో సంఘమిత్ర ఆసుపత్రి సమీపంలో ఓ కంటైనర్ ఢీ కొట్టగా వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తుండగా, శనివారం మృతి చెందాడు. మృతుని వివరాలు సేకరించడంతో రిమ్స్ నుంచి పరారైన చీమకుర్తికి చెందిన కరోనా పాజిటివ్ బాధితుడు అని గుర్తించారు.