4,600 మందికి ఆశ్రయం

ABN , First Publish Date - 2020-11-27T06:10:36+05:30 IST

జిల్లాలో నివర్‌ తుపాను వల్ల భారీవర్షాలు పడుతుండడంతో జిల్లా అధికార యంత్రాం గం లోతట్టు ప్రాంత ప్రజలను పునరావస కేంద్రాలకు త రలించింది.

4,600 మందికి ఆశ్రయం




ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 26: జిల్లాలో నివర్‌ తుపాను వల్ల భారీవర్షాలు పడుతుండడంతో జిల్లా అధికార యంత్రాం గం లోతట్టు ప్రాంత ప్రజలను పునరావస కేంద్రాలకు త రలించింది. సముద్ర తీరప్రాంతంలోని మండలాల్లో 98 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా గురువారం సా యంత్రానికి 4,600 మందిని అక్కడకు చేర్చేంది. ప్రధానం గా ప్రభుత్వ ఉన్నతపాఠశాలలు, కమ్యూనీటీ  భవనాలు, తుఫాన్‌షెల్టర్లతో పాటు మరికొన్ని భవనాలలో తగిన వస తులు ఏర్పాటు చేసి వాటిల్లోకి తరలిస్తున్నారు. 

కరోనా భయం  : కాగా పునరావాస కేంద్రాలకు వె ళ్ళేందుకు లోతట్టు ప్రజానీ కం నిరాకరిస్తున్నట్లు తెలి సింది. జిల్లాలో ఇటీవల వరకు కరోనాపాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో  ఆ ప్రభావం పునరావస కేంద్రాలపై పడనుంది. అందరిని ఒకే చోటకు తరలిస్తే కరోనా బారిన పడతామని అధికారుల ముందు వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. తాము వివిధ ప్రాంతాల్లో ఉండే బఽంధువుల నివాసాలకు వెళ్ళి తలుదాచుకుంటామని చెప్పి కుటుంసభ్యులతో వెళ్ళినట్లు తెలిసింది. అటువంటివారి వి వరాలను కూడా సంబంధిత మండల అదికారులు సేకరి స్తున్నట్లు సమాచారం. 


Updated Date - 2020-11-27T06:10:36+05:30 IST