ప్రకాశం జిల్లాలో కొత్తగా 449మందికి పాజిటివ్..
ABN , First Publish Date - 2020-09-27T17:48:47+05:30 IST
జిల్లాలో శనివారం కొత్తగా 449 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో 48 కరోనా కేసులు..
ఒంగోలు: జిల్లాలో శనివారం కొత్తగా 449 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో 48 కరోనా కేసులు నమోదు కాగా, కందుకూరులో 33, మర్కాపురం 28, చీమకుర్తి 25, యద్దనపూడి 21,పొదిలిలో 21 కేసులు వచ్చాయి. ఐదుగురు కరోనాతో మరణించగా, 80 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 38 మంది హోంక్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు. శనివారం నాటికి జిల్లాలో 1441 మంది చికిత్స పొందుతుండగా, రిమ్స్లో 745, అన్నీ కొవిడ్ కేర్ సెంటర్లలో 543, సంఘమిత్రలో 75, కిమ్స్లో 72, నల్లూరి నర్సింగ్ హోంలో 18, వెంకటరమణ నర్సింగ్ హోంలో 25, ప్రకాశం ఆసుపత్రిలో 25 మంది బాధితులు ఉన్నారు. రిమ్స్లో ఇప్పటి వరకు 284 మంది కరోనాతో మరణించారు.