జనజాతి గౌరవ దివస్‌ గోడ పత్రిక విడుదల

ABN , First Publish Date - 2020-11-14T03:24:11+05:30 IST

స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్‌ బిర్సా ముండా జయంతి సందర్భంగా శుక్రవారం సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ జనజాతి గౌరవ దివస్‌ గోడ పత్రికలను ఆవిష్కరించారు.

జనజాతి గౌరవ దివస్‌ గోడ పత్రిక విడుదల
జనజాతి గౌరవ దివాస్‌ గోడ పత్రికలను ఆవిష్కరిస్తున్న సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ

గూడూరు(రూరల్‌), నవంబరు 13: స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్‌ బిర్సా ముండా జయంతి సందర్భంగా శుక్రవారం సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ జనజాతి గౌరవ దివస్‌ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్‌ మాట్లాడుతూ బ్రిటిష్‌ వారితో పోరాడి 20 ఏళ్ల వయసుకే ప్రాణత్యాగం చేసిన గిరిజనయోధుడు భగవాన్‌ బిర్సా ముండా అన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకుడు మనోజ్‌కుమార్‌, చిన్నా, కార్తీక్‌, వెంకటేష్‌, ఉపేంద్ర  తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-14T03:24:11+05:30 IST